calender_icon.png 16 June, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని ప్రభుత్వానికి వేడుకోలు

16-06-2025 11:13:12 AM

చండూరు, (విజయక్రాంతి): గత 30 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా సోనగోని లక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఆమె పేరు లేకపోవడంతో లక్ష్మమ్మ తమ ఆవేదనను విజయక్రాంతి దినపత్రికతో వెలిబుచ్చారు. చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామానికి చెందిన సోనగోని లక్ష్మమ్మకు భూమి కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు కేటాయించకుండా ఆమెకు అన్యాయం చేశారు. ఈ గ్రామంలో ఎవరినైనా అడిగితే మీ పేరు సెకండ్ లిస్ట్ లో వస్తుందని మాయమాటలు చెబుతున్నారు.

మొదటి లిస్టులోనే ఈమె పేరును పెట్టాలి. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈమె పేరు లేకుండా తొలగించడంపై గ్రామములో ప్రజలు నిజమైన లబ్ధిదారుడికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపణలు లేకపోలేదు. లక్ష్మమ్మతో పాటు ఇంకా కొంతమంది భూమి లేని నిరుపేదలు ఉన్నప్పటికీ వారికి కుడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చండూర్ తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా విచారకరం. గ్రామంలో ఎవరినైనా అడిగితే ఈమెకు ఇల్లు కేటాయించకపోవడంతో ఈమెకు ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూమిలేని నిరుపేద అయిన లక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నాం.