16-06-2025 10:57:56 AM
ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు
ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు(Yellareddy DSP Srinivasa Rao) అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని వైశ్య భవన్ లో యోగ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యజ్ఞసహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి డీఎస్పీ, శ్రీనివాస్ రావ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగ గురువు,నాగరాజు గౌడ్ మాట్లాడుతూ ఆసనాలు వస్తే మానసిక ప్రశాంతత లభి స్తుందని తెలిపారు. 75 కోట్ల సూర్య నమస్కారాల్లో భాగంగా రాష్ట్రంలో,కామారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని అన్నారు.
యోగ సాధన అంటే యోగా అభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందడం. ఇది ఒక వ్యక్తి తన అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించడానికి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామరస్యాన్ని సాధించడానికి చేసే ఒక ప్రక్రియ, అని, సాధారణంగా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఇతర యోగ పద్ధతుల ద్వారా ఇది సాధించబడుతుందన్నారు.భౌతిక శరీరానికి సంబంధించిన భంగిమలు, ఇవి శరీరానికి బలం, ఆవశ్య కత, సమతుల్యతను చేకూరుస్తాయి,అని యోగా గురువు నాగరాజ్ గౌడ్ తెలిపారు. 365 రోజులుగాక్రమం తప్పకుండా యజ్ఞ సైతం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యోగాసన సభ్యులు,పలువురు పాల్గొన్నారు.