22 March, 2026 | 2:22 AM

యాదాద్రికి భక్తుల తాకిడి

22-03-2026 12:59 AM
  1. ధర్మ దర్శనానికి మూడు గంటలు..
  2. స్పెషల్ దర్శనానికి రెండు గంటలు..

యాదగిరిగుట్ట, మార్చి 21 (విజయక్రాంతి): శని, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల రద్దీ పెరిగింది. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. కొండ కింద రింగ్‌రోడ్డులో ఎటు చూసినా వాహనాలు కనిపించాయి. కొండపైన సైతం వాహన రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు వాహనాలను అనుమతించలేదు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.