15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నాగర్‌కర్నూల్ బీసీలకు రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం

25-11-2025 02:45 PM

బిసి జేఏసీ ఆగ్రహం

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో బీసీలపై జరుగుతున్న అన్యాయంపై బిసి –జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం 460 గ్రామ పంచాయితీ సర్పంచ్ స్థానాల్లో బీసీలకు కేవలం 61 (13.3%) మాత్రమే కేటాయించడంపై నాయకులు మండిపడ్డారు. జిఓ.46 ప్రకారం బీసీలకు 23% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉన్నా, జిల్లాలో కేవలం 13.3% మాత్రమే కల్పించారని ఆరోపించారు. ఎస్టి లకు 133 (29%), ఎస్సీ లకు 85 (18.5%) కేటాయించడంతో మొత్తం రిజర్వేషన్లు 60% దాటాయని, ఇది సుప్రీంకోర్టు విధించిన 50% క్యాప్‌కు విరుద్ధమని బిసి –జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

బీసీలు ఓటర్లలో 50–56% ఉన్నా, సర్పంచ్ స్థానాల్లో 13% మాత్రమే రావడం తీవ్ర అన్యాయమన్నారు. అమ్రాబాద్ మండలంలోని ఐదు గ్రామాలను ఎస్టీ రిజర్వ్‌గా ప్రకటించినప్పటికీ, అక్కడ ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేని కారణంగా ఎన్నికలు నిర్వహించే ఆస్కారం లేదన్నారు. వెంటనే ఈ కేటాయింపులను మార్చాలని బిసి –జేఏసీ డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఏవో చంద్రశేఖర్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శివ శంకర్ యాదవ్ మ్యాకల, కుంభం మల్లేష్ గౌడ్, డా. కాళ్ల నిరంజన్, అరవిందాచారి, చిక్కొండ్ర శ్రీశైలం, నారమోని నరేష్ తదితరులు పాల్గొన్నారు.