08-12-2025 12:00:00 AM
బెజ్జూర్ అడవులను సందర్శించిన అకాడమీ అధికారులు
బెజ్జూర్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 38 మంది బీట్ అధికారులు ఆదివారం బెజ్జూరు అడవుల్లో క్షేత్ర పర్యటన చేశారు. ఫీల్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, స్థానిక అటవీ అధికారుల బృందంతో ఇక్కడి అటవీ ప్రాంత ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
మండలంలో కృష్ణ పల్లి సెక్షన్ పరిధి లోని ఇందురుగాం బీట్లోని రాముడు భీము డు టేకు చెట్లు, బేస్ క్యాంపును పరిశీలించారు. అనంతరం మాణిక్య దేవరా అటవీ ప్రాంతం లో పులుల ఆవాస ప్రాంతాన్ని సందర్శించి పులుల కదలికలు, వాటి పాదముద్రలు పరిశీలించారు. పెద్దపులి ఎటు నుంచి ఎటువైపు వెళుతుందో పాదముద్రల ఆధారంగా గమని స్తూ వెళ్లారు. వారివెంట రేంజ్ అధికారి ముసావీర్, డిప్యూ టీ రేంజ్ అధికారి శ్రావణ్, సెక్షన్ అధికారి సోఫియా, బీట్ అధికారి గోపాల్ ఉన్నారు.