26 March, 2026 | 12:08 PM

Breaking News

మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •   ఎంతమందిని తొక్కుతవ్!   •  

ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన

09-12-2025 01:20 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామాగ్రి పంపిణీ కోసం సమస్త ఏర్పాట్లు చేసి పంపిణీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు పంపిణీ కేంద్రాలను సమగ్రంగా పరిశీలించి పకడ్బందీగా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం చేసి నట్లు తెలిపారు.

కాగా మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు. పదవ తేదీ ఉదయం నుంచి ఈ సామాగ్రిని పోలింగ్ అధికారులకు అందజేస్తామని ఎంపీడీవో రమాకాంత్ తెలిపారు. కేంద్రాల్లో పోలీసులు సిఐ అజయ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారితో పాటు ఎస్సై రాహుల్ గైక్వాడ్, ఎం పి ఓ సి హెచ్ రత్నాకర్ రావు, ఎంఈఓ సంధ్య, తదితరులు ఉన్నారు.