23-10-2025 06:07:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.