కొనుగోలు కేంద్రాల తనిఖీ

29-04-2024 01:51:05 AM

మంచిర్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): జైపూర్ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలని, కాంటా వేసిన బస్తాలను వెంట వెంటనే మిల్లులకు తరలించాలని కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు సూచించారు అనంతరం టేకుమట్లలోని జయలక్ష్మి, మంజునాథ రైస్ మి ల్లులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మేనేజర్ సంతోష్, సహకార శాఖ ఏఓ నరేష్, కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.