29-04-2025 12:00:00 AM
రేవల్లి : ఏప్రిల్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లనిర్మాణం ప్రారంభించినది అందులో భాగంగా సోమవారం ఎంపీడీఓ విజయ కుమార్ ఆధ్వర్యంలో శానాయిపల్లి, బండరాయిపాకుల గ్రామాలలో ధరఖాస్తుదారుల ఇల్ల స్థలాలను పరిశీలించారు, ఈ సందర్బంగా లబ్దిదారులతో ఎంపిడివో విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిభందన మేరకు ఇంటి చుట్టుకోలత 4వందల ఫీట్లుతగ్గకుండ 6వందల ఫీట్లకు మించకుండ కట్టుకోవాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో ఏ పి ఓ నరసింహ,కార్యదర్శి కృష్ణ కుమార్,ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు మిద్దె రాములు(స్వామి),మిద్దె మురళీ,లింగస్వామి, మహుముద బేగం, కురుమయ్య,గోపాల కన్నమ్మ, పుల్లాసు రాజు, ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు సుస్మిత,నాయకులు సిరిమల్లేష్, మండ్ల రాములు, మిద్దెశేఖరయ్య,శాతర్ల రాములు,పుల్లాసి నరసింహ, ఎత్తపు నాగమ్మతదితరులు పాల్గొనడం జరిగింది.