దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం
02-07-2026 03:18 PM
బోథ్, జులై 2(విజయక్రాంతి): నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు బజార్హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తపల్లి గ్రామానికి నూతనంగా నిర్మించిన బ్రిడ్జి నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ రాజేష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్యతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా గ్రామస్తులు డబ్బులు వైద్యాలతో ఘనంగా స్వాగతించారు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా గ్రామం అభివృద్ధి చెందలేదని గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పంచాయతీరాజ్ డి ఈ రాజేశ్వర్ ఏ ఈ శేఖర్ లతోపాటు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు






