కొత్తపేట పండ్ల మార్కెట్లో తనిఖీలు
27-04-2024 01:04 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 26 : కొత్తపేట పండ్ల మార్కెట్లో టాస్క్పోర్స్ బృందం తనిఖీ చేపట్టింది. కొందరు వ్యాపారులు నిషేధిత రసా యనాలను వినియోగిస్తూ మామిడి పండ్ల ను కృత్రిమంగా పక్వానికి తెస్తున్నారు. ప్రభు త్వం సూచించిన పద్ధతులతోనే పండ్లను మగ్గించాలని సూచించారు. నిషేధిత రసాయనాలను వినియోగించి, ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడోద్దని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. రసాయనాలతో మగ్గించిన సుమారు 550కిలోల మామిడి పండ్లను టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు మార్గదర్శకాలను పాటించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై జీహెచ్ఎంసీ వాట్సాప్ నంబర్ 9100105795కి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు.






