05-09-2025 12:20:08 AM
ఏటూరు నాగారం, సెప్టెం బరు 4 (విజయక్రాంతి) : ఏటూరు నాగారం, మంగ పేట మండలాల్లో పలు మీసేవ కేంద్రాలను తహశిల్దార్ రవీందర్ , ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాలను ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండి ESౄ గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపవలనని సూచించారు.
నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అట్టి మీసేవ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మీసేవ సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చార్టర్ , భూభారతి కి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో మరియు తాహాసిల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండవలెనని ఆదేశించారు.
ఆపరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ, భూభారతి మరియు మిగతా ఆన్లైన్ సర్వీస్ లను ప్రజలకు అందించాలని సూచించారు.ఏటూరునాగారం మండల ప్రజలు ఆధార్ సేవల గురించి ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించి అదనపు కొత్త ఆధార్ సెంటర్ల ని మండల కేంద్రంలలో అతి త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని మరియు మీసేవ ఆపరేటర్లు ప్రజల పట్ల సున్నితంగా ఉంటూ వారికి మీసేవ సర్వీసులను మరియు ఇతర అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు.