13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

54 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

20-01-2026 12:00 AM
  1. హైదరాబాద్ సీసీఎస్,సైబర్ విభాగాల్లో మార్పులు
  2. అర్ధరాత్రి సీపీ సజ్జనార్ ఉత్తర్వులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 19 (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ప్రక్షాళన జరిగింది. సీపీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి 54 మం ది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ వంటి హై-ప్రొఫైల్ పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్హెచ్‌ఓలను నియమించగా..

సైబర్ క్రైమ్, సీసీఎస్ విభాగాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికా రులను బదిలీ చేసి కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేయడం చర్చనీయాంశంగా మారిం ది. తాజా ఉత్తర్వుల ప్రకారం వెయిటింగ్ లిస్టులో ఉన్న పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్ విభాగంలోనూ భారీ మార్పులు జరిగాయి. 32 మందిని సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.