13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలి

20-01-2026 12:00 AM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

రాజన్న సిరిసిల్ల, జనవరి 19 (విజయ క్రాంతి): మహిళలు ఆకాశమే హద్దుగా ముం దుకు వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని 1295 ఎస్ హెచ్ జీ లకు దాదాపు రూ.4 కోట్ల 64 లక్షల 68 వేల 771 రూపాయల చెక్కులను వేములవాడ పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్, సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇం చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి సో మవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీ నివాస్ మాట్లాడారు.

ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎస్ హెచ్ జీలకు వడ్డీ రుణాలు పంపిణీ చేశామని తెలిపారు.జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ స్వయం సహాయక మహి ళా సంఘాలకు మూడో విడత కింద మొత్తం 1295 ఎస్ హెచ్ జీ లకు దాదాపు రూ.4 కోట్ల 64 లక్షల 68 వేల 771 రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు.

సిరిసిల్ల మున్సిపల్ పరి ధిలో 903 ఎస్ హెచ్ జీలకు రూ. 3 కోట్ల 18 లక్షల 49 వేల 135, వేములవాడ మున్సిపల్ పరిధిలో 392 ఎస్ హెచ్ జీలకు రూ. కోటి 46 లక్షల 19 వేల 636 రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వెల్లడించారు.ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 2023 డిసెంబర్ నుంచి మార్చి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఎస్ హెచ్ జీ లు 964లకు రూ.57 లక్షలు, రెండో విడతలో 2024 - 20 25 1236 ఎస్ హెచ్ జీ లకు రూ. 4కోట్ల 6 లక్షల వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిందని గు ర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ చైర్మన్లు రాజు, స్వరూపారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, శేషాద్రి, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.