26-01-2026 06:03:17 PM
మఠంపల్లి: గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కు నాగార్జున సిమెంట్స్ పరిశ్రమలో అవమానం, నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థాపక రోజు కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటం లేకపోవడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వివాదానికి దారితీశాయి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను యాజమాన్యం అవమానించిందని ప్రస్తుతం మండల కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది.రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున నిర్వహించే ఈ వేడుకల్లో రాజ్యాంగం నిర్మాత అయిన అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడంపై మండలంలో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.