25 February, 2026 | 3:01 AM

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

25-02-2026 01:14 AM

నవాబ్పేట, ఫిబ్రవరి 24: మండలం చాకల్పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి, జినుకుంట పురుషోత్తం మనస్తాపంతో పురుగుల మందు తాగి ప్రా ణాలు కోల్పోయిన సంఘటన చోటుచేసుకుంది. మృతుని సోదరుడు జినుకుంట శివకుమార్ నవాబ్పేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (బీపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాడు.

గత కొం తకాలంగా అతను చదువుపై ఆసక్తి చూపక, కళాశాలకు సరిగ్గా వెళ్లడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై ఆరా తీయగా, చదువు అబ్బడం లేదని, ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తమ్ముడు తమతో చెప్పాడని శివకుమార్ పేర్కొన్నారు.చికిత్స పొందుతూ మృతి చెందాలని తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులుమృతుని మరణంపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ మేరకు నవాబ్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.