విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరం
24-02-2026 12:46 AM
శామీర్పేట్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నిన్న ఆదివారం హకీంపేట్ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో విద్యార్థి శ్రీనాథ్ ఆత్మహత్యయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సోమవారం జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థులను ఆత్మహత్యయాత్యానికి గల కారణల గురించి ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నారు. పాఠశాల యజమాన్యం, సిబ్బందితోనూ విచారణ జరిపినట్లు తెలిసింది. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.




