22-06-2025 12:28:03 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నది. దీనిలో భా గంగానే గొర్రెల పంపిణీ, పార్ములా ఈ రేసు స్కాంల ఆరోపణలు బయటకు వచ్చా యి. ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో అక్ర మాలు, అవకతవకలు జరిగాయంటూ, వాటిని తేల్చేందుకు సర్కార్ కమిషన్ను సైతం ఏ ర్పాటు చేసింది. ఇన్ని వివాదాలు, కేసుల్లో ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరైనా అరెస్టు కాలేదు.
ఎంతసేపు నోటీసులు, విచారణ జరుగుతున్నదే తప్ప.. అంతకుమించి మరేమీ జరగడం లేదు. ఒక్క గొర్రెల పంపిణీ స్కాంలో మాత్రం కొందరు అధికారులు అరెస్టయ్యారు. కానీ, అసలు సూత్రధారులెవరన్న విషయం మాత్రం బయటకు రాలేదు. నాటి మంత్రి కేటీఆర్ ఇటీవల నేరుగా సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు ఎక్కుపెడుతున్నా.. సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇదంతా చూస్తుంటే.. అసలు విచారణలన్నీ తూతూ మంత్రానికేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ది విజయ్భాస్కర్