calender_icon.png 22 June, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానం వద్దు బాబోయ్.. ‘వందేభారత్’కే జై

22-06-2025 12:29:52 AM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల సంభవించిన విమాన ప్రమాదం తర్వాత ‘ఎయిరిండియా’ డ్రీమ్ లైనర్ విమానా ల్లో ప్రతిరోజు ఏదోఒక చోట విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వీసులు రద్దవుతు న్నాయి. దీంతో ప్రయాణికు లు ఎయిర్‌ఇండియా విమానమంటేనే హడలెత్తుతున్నారు.

విమానానికి ప్రత్యమ్నాయంగా కొందరు ప్రయాణికులు ‘వందేభారత్’ రైళ్లను ఎంచుకుంటున్నారని, బుక్ అవుతున్న టికెట్లను చూస్తే తెలుస్తు న్నది. విమాన ప్రమాదంతో పాటు అదే విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదనేది వాస్తవం.       

పెద్ది విజయ్‌భాస్కర్