06-06-2025 12:00:00 AM
డా. యం.సురేష్బాబు :
ఐపీఎల్ ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదిక అందించడం, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడను ప్రోత్సహించడం. కానీ, విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగే షెడ్యూల్ ఉంది. అలాగే ప్రతికూల వాతావరణంలో పోటీలు పెడుతున్నారు.
బెంగళూరు జట్టు ఐపీఎల్ విజే త అయినందుకు కర్ణాటక లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం సా యంత్రానికి వారిని ఘనంగా సత్కరించిం ది. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓపెన్ టాప్ మల్టీ ఆక్సిల్ బస్సు లో హెచ్ఏయల్ నుంచి విధానసభ వర కు ఊరేగింపు జరిపింది. సన్మానం జరుగుతున్న వేళ చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయపడ్డారు.
అక్కడ గెలిచింది ప్రపంచ కప్పు కాదు, కనీసం ఒక దేశంపై గెలిచిన సిరీస్కూడా కాదు. నానాజాతి సమితిలా గా ఒక జట్టు మరో జట్టుమీద గెలిచింది. జట్టు స్పాన్సరర్లు కర్ణాటక వారు కాదు. అందులో ఆటగాళ్లూ ఆ రాష్ట్రం వారు కాదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉం దో, ఆర్సీబీ జట్టులో కర్ణాటక వారు అంతే. జట్టులో కెప్టెన్ మొదలుకొని అంతా ఇతర రాష్ట్రాలు, దేశాల ఆటగాళ్లే. ఆర్సీబీ గెలిచిం ది.
పంజాబ్ కింగ్స్మీద. పంజాబ్ కింగ్స్ లో కూడా ఇలాంటి నానాజాతి సమితి. ఒకప్పుడు గతంలో భారత జట్టు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్టుపై గెలిచింది అంటే దానికొక అర్థం ఉండేది.
ఉదయం నుంచి బెంగళూరు వీధుల్లో ఆర్సీబీ జట్టు టీ షర్ట్లు ధరించి విచిత్రమైన జెండా పట్టుకొని బండి సైలెన్సర్ తీసి ట్యాటోస్ ధరించి విన్యాసాలు చేస్తూ, పది రూపాయల పాప్కార్న్ రెండు వందలు, పది రూపాయల టీ వంద రూపాయలు పెట్టి కొని దారిన వచ్చిపోయే వారికి ఇబ్బందితో నిత్యం ట్రాఫిక్ జామ్ కల్గించే వారిది అభిమానమా లేక దేశభక్తా? ఎందుకింత అత్యుత్సాహం!
పరీక్షల సమయంలోనే ఎందుకు?
పాకిస్థాన్లో శత్రు స్థావరాలను నేలమ ట్టం చేసిన సోఫియా ఖురేషి, వ్యోమిక సిం గ్కు ఇంతటి ఆదరణ లేదు. వారిని ట్రోలిం గ్ చేయడం దూషించడం లేదా దూషించినా మౌనంగా ఉండటం వీరి దేశభక్తి. ఐపీఎల్ అనేది భారతదేశంలో ఒక ప్రొఫెషనల్ ట్వంటీ-20 క్రికెట్ లీగ్. ఇది 2008 లో బీసీసీఐ ద్వారా స్థాపితమైంది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొం దిన లాభదాయకమైన క్రికెట్ లీగ్లలో ఒకటి.
ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత నలభై దాటినప్పుడు, విద్యార్థులకు టర్మ్ ఎండ్ పరీక్షలు ఉన్నప్పుడు, నీట్, ఎప్సెట్ వంటి పోటీ ప రీక్షలున్నప్పుడు, ప్రతి ఏడాది మార్చినుంచి జూన్ వరకు జరుగుతుంది. ఐపీఎల్ ఉద్దే శ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదిక అందించడం, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడను ప్రోత్సహించడం.
కానీ, విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగే షెడ్యూల్ ఉంది. అలాగే ప్రతికూల వాతావరణంలో పోటీలు పెడుతున్నారు. నిరంతర విమర్శలు ఉన్నప్పటికీ, ఇది గరిష్ట సంఖ్యలో వీక్షకులను సంపాదించుకోగలిగింది.
బెట్టింగ్లను నివారించలేరా?
భారతదేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది గుర్రపు పందెం లాంటిది. బెట్టింగ్ చాలావరకు చట్టవిరుద్ధం. క్రీడల బెట్టింగ్ రాష్ట్రాల చట్టాలపై ఆధారపడింది. భారతదేశం క్రికెట్తో మరే ఇతర దేశంతో పోల్చలేని ప్రేమను కలిగి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్ అన్నింటినీ మించిపో యింది. ఐపీఎల్ ఇప్పుడు ఎవరి నోట వి న్నా ఇదే మాట. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ చర్చించుకుంటున్న ఆట క్రికెట్.
ఈ పిచ్చి ఉన్న ఆటగాళ్లు, ఐపీఎల్ మ్యా చ్ల నేపథ్యంలో టీవీలకే అతుక్కుపోతారు. ఇదే సమయంలో పందెం రాయుళ్లు ‘సందట్లో సడేమియా’ అన్నట్లు ఒకవైపు క్రికెట్ ను ఆస్వాదిస్తూనే మరోవైపు తమదైన శైలిలో బెట్టింగ్ కాస్తూ, సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ బెట్టింగ్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.
చాలామంది అమాయక యువకులు దీని ఊబిలోకి దిగబడిపోయి, ఆర్థికంగా చితికిపోతూ, ఒక్కోసారి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఒకే సీజన్లో వరసగా సుమారు 80కి పైగా మ్యాచ్లు జరుగుతుండటంతో బెట్టింగ్ల జోరుకు అడ్డుకట్ట లేకుండా పోతున్నది. బెట్టింగ్ రాయుళ్లు వాడే భాషలో ‘లెగ్ ’అనే పదం కీలకమైం ది. ఎన్ని లెగ్గులు తీసుకుంటే లెక్క ప్రకారం అంత మొత్తం చెల్లించాలనేది దాని అంతరార్థం.
అలాగే గెలిచే అవకాశాలు ఎక్కువ గా ఉన్న జట్టుపై పందెం కాసేందుకు ‘ప్లేయింగ్’ అని, తక్కువ అవకాశాలున్న జట్టు పై పందెం కాసేందుకు ‘ఈటింగ్’ అనే పదాలను ఉపయోగిస్తారని సమాచారం. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికస్తూ వున్నా కొందరు దీనినే వృత్తిగా సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది క్రీడకు పెద్దముప్పుగా ఉంది.
గ్రామీణ ప్రాంతాలకూ పాకింది!
ఆన్లైన్ జూదం ఆగమనం ఆర్థిక లా భం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ ప్రమాదాన్ని పెంచింది. ప్రపంచ జూద పరిశ్రమ భారీ స్థాయి వ్యవస్థీకృత నేరాలకు ఆకర్షణీయంగా ఉంది. అలాగే, పందెం రకాల పరిధి పెరిగింది. లోపల తప్పుడు సమాచారం. అటువంటి జూదం ఫిక్సింగ్ కార ణంగా అవినీతికూడా పెరిగింది. స్పోర్ట్స్ బెట్టింగ్ చట్టం అనేది గందరగోళంగానేకాక సంక్లిష్టమైన అంశం.
ఎందుకంటే, ప్రతి దేశానికి స్పోర్ట్స్ బెట్టింగ్కు సంబంధించి దాని స్వంత చట్టాలు ఉన్నాయి. గుర్రపు పందాలపై బెట్టింగ్లు మినహా భారతదేశంలో క్రీడల బెట్టింగ్లు ప్రధానంగా చట్ట విరుద్ధం. ఇతర క్రీడలు వ్యక్తిగత రాష్ట్రాల చట్టాలు లేదా భారతదేశం సాధారణ చట్టాలపై ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో ఎక్కువ భాగం పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867, టెక్నాలజీ యాక్ట్ 2000కి లోబడి ఉంది.
ఆ చట్టాల ప్రకారం స్పోర్ట్స్ బెట్టింగ్ అనుమతించబడదు. కానీ, ఒక్కో రాష్ట్రానికి వారి స్వంత చట్టాలు రూపొందించుకునే హక్కు ఉంటుంది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ (1867) ప్రకారం భారతదేశంలో అన్ని రకాల జూదాలు చట్ట విరుద్ధం. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా దేశంలో క్రికెట్ బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇది చాలదన్నట్లు పలు నిషేధ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ అగ్రతారల ప్రచారం మరోవైపు.
జిల్లా కేం ద్రాలతోపాటు మండల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ అక్రమ దందా ఊపందుకుం ది. ఐపీఎల్ బెట్టింగ్ ఇంతకు ముందు నగరాలకే పరిమితం కాగా, ప్రస్తుతం పల్లెల కూ పాకింది. జిల్లా కేంద్రాలలో లాడ్జ్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ ఆడుతున్నట్టు స మాచారం.
గూగుల్ టేక్ద్వారా ఎక్కువగా డబ్బు మార్పిడి జరుగుతున్న ప్రాంతాలను గుర్తించవచ్చు. ప్రధాన విద్యాసంస్థలు, అసంఘటితంగా ఉన్న డ్రైవర్లు, కూలీ పనులు చేసుకునే వారు, కార్మికులు డబ్బు సులభంగా సంపాదించాలని కోరిక వారిని బెట్టింగ్ బారిన పడేలా చేస్తున్నది.