15 March, 2026 | 10:52 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

వార్డుల విభజనలో అవకతవకలు

09-01-2026 12:00 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతి

గజ్వేల్, జనవరి 8: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని  వార్డుల, ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్నాయని టెలికం బోర్డు సభ్యుడు కమ్మరి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని  ఆధారాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తలెత్తుతుందన్నారు. 

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని, తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం, సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపామన్నారు.

ఈ మేరకు  కమిషనర్ స్పందించి  సిద్దిపేట జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు కమ్మరి శ్రీనివాస్ తెలిపారు. సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తామన్నారు.