21-06-2025 01:27:58 AM
ఎల్బీనగర్, జూన్ 20 : దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ బస్సు డిపోలు ప్రతి రోజూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ తర్వాత అత్యంత రద్దీ గా ఉండే దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ బస్టాండ్ లో భద్రత కరువైంది. రెండు తెలు గు రాష్ట్రాల నలుమూలలకు ఇక్కడి నుంచి బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళల్లో వేలాది ప్రయాణికులతో దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ కిక్కిరిసిపోతుంది.
ఇంతటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఎలాం టి ముప్పు వాటిల్లుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో అనేక మంది మృతి చెందడంతో పాటు వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత ఇటీవల తెలు గు రాష్ట్రాల్లో కొందరిని జాతీయ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా రద్దీ ప్రాం తాల్లో పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.
ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లులో భద్రతా చర్యలు కనిపించడం లేదు. పోలీసుల గస్తీ, నిఘా కనిపించడం లేదు. ప్రయాణికులను తనిఖీ చేసేవారు కనిపించరు. ఎవరూ ఇక్కడి నుంచి వస్తున్నారు? ఏఏ లగేజీ తరలిస్తున్నారు?, ఎంత మంది అక్రమ వలసదా రులు ప్రయాణిస్తున్నారు? తదితర ప్రశ్నలకు సమాధానం లేదు. దిల్ సుఖ్ నగర్ లోని హైదరాబాద్-2 ఆర్టీసీ డిపో నిత్యం ప్రయాణికులు, బస్సులతో రద్దీగా ఉంటుంది.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇక్కడ నుంచి ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు చేస్తుంటారు. విజయవాడ జాతీయ రహదారికి పక్కనే దిల్ సుఖ్ నగర్ లో ఆర్టీసీ డిపోను అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించారు. రం గారెడ్డి రీజియన్లో రోజు వారీగా సంస్థకు అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టే డిపోల్లో దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సూ ర్యాపేట, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాం తాలకు పదుల నిత్యం సంఖ్యలో బస్సు లు, వందల మంది ప్రయాణిస్తుంటారు.
నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ డిపోల్లో నుంచి సిటీ బస్సులు వెళ్తుంటాయి. దిల్ సుఖ్ నగర్ డిపో నుంచి నిత్యం సుమారు 20 వేల మం ది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దసరా, దీపావ ళి, సంక్రాంతి, రాఖీ పౌర్ణమి తదితర పండగల సమయంలో డిపోలు ప్రయాణికులతో కిటకిటలాడుతాయి.
దిల్ సుఖ్ నగర్ బస్టాం డ్ సమీపంలోనే మెట్రో స్టేషన్ ఉండడంతో ట్రాఫిక్ సమయాల్లో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మెట్రో ద్వారా ఇక్కడకు వచ్చి, ఇక్కడి నుంచి గమ్య స్థానాలకు వెళ్తుంటారు. ఇంతటి కీలకమైన డిపో ఆవరణలో కనీస రక్షణ చర్యలు కనిపించడం లేదు. ఏవై నా ఘటనలు జరిగితే, హడావుడి చేయడం తప్పా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు.హయత్ నగర్ డిపో నల్గొండ, ఖమ్మం జిల్లా వాసులకు గమ్యస్థానం.
ఇక్కడి నుంచే ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తుంటా రు. దీంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి సిటీ బస్సులు సిద్ధంగా ఉం టాయి. జిల్లాలకు వెళ్లే బస్సులతోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లడానికి సిటీ బస్సులు ఉంటాయి. దీంతో హయత్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ నిత్యం ప్రయాణికు లతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ప్రయాణికుల భద్రతకు ఎలాంటి రక్షణ చర్యలు కనిపించవు.
ముఖ్యంగా సీసీ కెమెరాలు ఉండవు... పోలీసుల గస్తీ కనిపించదు.- సీసీ కెమెరాలు ఉన్నా.. ఫలితం శూన్యం దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ ప్రయాణికుల ప్రాంగణాల్లో దుకాణదారులు తమ దుకాణాల భద్రతకు వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ లో నా లుగు సీసీ కెమెరాలను దుకాణాదారులు ఏ ర్పాటు చేసుకున్నారు. నాలుగు కెమెరాలు ఉండగా అందులో రెండు కెమెరాలు ప్రస్తు తం పని చేయడం లేదు.
అత్యవసర పరిస్థితుల్లో వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలతో పాటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపైనే ఆధారపడాల్సి వ స్తుంది. హయత్ నగర్ బస్టాండ్ లో రెండు సీసీ కెమెరాలు ఉండగా... పోలీసులు ప్రధా న రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లు ఉన్నాయి. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాత్ర మే రక్షణగా ఉన్నాయి.
ఆర్టీసీ బస్టాండ్లులో సీసీ కెమెరాలు ఉన్నా.. ఫలితం శూన్యం. బ స్టాండ్లలో జరిగే చోరీల నివారణకు, అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడానికి రక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఆర్టీ సీ అధికారులు స్పందించి భద్రతకు భరోసా ఇచ్చే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీసుల నిఘా, గస్తీ పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.