21-07-2025 12:22:50 AM
సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఉస్తాద్ భగత్సింగ్. ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. మరో కథానాయికగా బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఎంపికైనట్లు తెలిసింది.
ఈ రోల్ కోసం చాలా మంది హీరోయిన్లను పరిశీలించి, ఆఖరికి రాశీ ఖన్నాను ఫైనలైజ్ చేశారని, ఇప్పటికే రాశీ షూటింగ్ సెట్లో అడుగు పెట్టి, పవన్ కళ్యాణ్తో కలిసి కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాకి దేవిశ్రీప్రసా ద్ సంగీతం అందిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘గబ్బర్సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్-, హరీష్శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.