06-09-2025 11:05:20 PM
మంగపేట,(విజయక్రాంతి): మల్లూరు క్షేత్రాన్ని ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా ఐఏఎస్ శనివారం దర్శించుకున్నారు స్వామివారికి విశిష్టమైన రోజు స్వామివారి నిజరూప దర్శనం తైలాభిషేకం చేసి భక్తులకు నాభి చందనాన్ని అందజేస్తారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు కార్య నిర్వహణ అధికారి రేవెల్లి మహేష్ ఐటిడిఏ పిఓ కు స్వాగతం పలికి వారి గోత్ర నామాలతో అర్చనలు అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం స్వామివారి విశేషమైన పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయం యొక్క విశిష్టతలను వివరించారు.