15 March, 2026 | 10:25 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ముల్కనూర్ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్‌గా జక్కుల ఐలయ్య

20-01-2026 12:16 AM

రికార్డు స్థాయిలో టెండర్ వేలం పాటలు

భీమదేవరపల్లి, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ జిల్లాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముల్కనూర్ లో జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా జక్కుల ఐలయ్య నియామకం అయ్యారు. సోమవారం ముల్కనూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతరలో దుకాణాల ఏర్పాటుకు ముల్కనూర్ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, కొత్తకొండ ఆలయ ఈవో కిషన్ రావు, ఎంపీడీవో వీరేశం ముల్కనూర్ ఈవో పూర్ణ చందర్,

ఊస కోయిల ప్రకాష్ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొబ్బరికాయలు అమ్ముకునేందుకు 1,35,000, లడ్డు పులిహోర అమ్ముకునేందుకు 1, 720,00, కొబ్బరికాయల టికెట్లు ప్రత్యేక దర్శనం కు 1,40,000 వేలం పాటలు జరిగినాయి.