5 June, 2026 | 7:16 PM

నాచారం గుట్టలో జల ప్రసాదం ప్లాంటు ప్రారంభం

05-06-2026 06:33 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన జల ప్రసాదం ప్లాంటును గజ్వేల్ మాజీ శాసనసభ్యులు తూంకుంట నర్సారెడ్డి, ప్రముఖ జ్యోతిష్యులు పరాంకుశం వేణు స్వామి కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ జల ప్రసాదం ప్లాంటును ఏర్పాటు చేసినట్లు దాతలు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.