జేసీ దివాకర్ రెడ్డి బస్సులు దగ్ధం
అనంతపురం: అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి(Former minister JC Diwakar Reddy)కి చెందిన ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. నాలుగు బస్సులు చుట్టుపక్కల ఆగి ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, మరో బస్సుకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బస్సు దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలిన బస్సు సమీపంలో తెగిపడిన విద్యుత్ తీగలను అధికారులు గుర్తించారు. జేసీ దివాకర్ ట్రావెల్స్(JC Diwakar Travels)ప్తె కేసు తర్వాత బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.






