19-01-2026 01:02:25 AM
రాయదుర్గం నంది హిల్స్లో ప్రారంభం
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): మారుతున్న జీవనశైలికి మాతృత్వా నికి దూరం అవుతున్న మహిళలకు జీవన్ ఉ మెన్స్ అండ్ ఫెర్టిలిటీ కేర్ సెంటర్ అందరికీ అందుబాటులో ఉంటుందని, మాతృత్వానికి దూరంగా ఉంటున్న ఆడబిడ్డలకు సహా యం చేయాలని జీవన్ ఉమెన్ అండ్ సేఫ్టీ కేర్ను ఏర్పాటు చేయడం అభినందనీయం అని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు.
రాయదుర్గం పిఎస్ పరిధిలోని నంది హిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన జీవన్ ఉమెన్ అండ్ ఫెటిలిటీ కేర్ను ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మురళి ప్రారంభించారు. రఘునందన్రావు మాట్లాడుతూ.. తక్కువ ప్యాకేజీతో నూతన టెక్నాలజీతో మె రుగైన వైద్యాన్ని అన్ని తరగతుల ఆడపడుచులకు జీవన్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ కేర్ అందుబాటు లోకి వచ్చిందని అన్నారు.