25-06-2025 11:24:59 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గంగారం మండలంలో బుధవారం రాత్రి విద్యుదాఘాతంతో జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న చిలుక ప్రవీణ్ దుర్మరణం పాలయ్యాడు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మడగుడా ప్రాంతంలో మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.