calender_icon.png 26 June, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

25-06-2025 11:20:33 PM

20 రోజుల వ్యవధిలో దంపతుల మృతి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): భార్య మరణం తట్టుకోలేక భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్(SI Muralidhar Raj) కథనం ప్రకారం... సంఘటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన జల్లి నిర్మల 20 రోజుల క్రితం సమీప బంధువుల తగాదలతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈ క్రమంలో భార్య చనిపోయి మనస్థాపానికి గురైన భర్త బాబు తాగుడుకు బానిసై మంగళవారం భార్య సమాధి వద్దకు చేరుకొని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు అతన్ని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఇరవై రోజుల వ్యవధిలో భార్య భర్త మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.