04-06-2025 01:01:51 AM
న్యూఢిల్లీ, జూన్ 3: కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో నివసిస్తున్న ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 85 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని, 15 ఏండ్లకు మించి ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు, కనీసం ఏడేళ్లపాటు అక్కడ చదువుకొని 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరైనవారిని స్థానికులుగా గుర్తించా లని నిర్ణయించింది.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. దీంతోపాటు లడాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మూడులో ఒకవంతు సీట్లను మహిళలకే కేటాయించనున్నారు. ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. 2019లో దీన్ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్ను రెండు భాగాలుగా ఏర్పాటు చేసిన విషయం విధితమే.
జమ్మూకశ్మీర్, లడాఖ్లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డా యి. ఈ నేపథ్యంలో తమ భాష, సంస్కృతి, హక్కుల పరిరక్షణ కోసం స్థానికంగా నిరసనలు వెలువెత్తుతున్న నేపథ్యంలో స్థానికుల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.