26-06-2025 01:13:36 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy) సమక్షంలో గురువారం పట్టణంలోని 47 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అంబటి నాగరాజు ఆ పార్టీ కి రాజీనామా చేసి బిఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీలో చేరారు. కంచర్ల వారికి గులాబీ కండువా కప్పి, పార్టీలోకి సాధర పూర్వకంగా ఆహ్వానించారు. వార్డులో అందరితో కలిసి పని చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆయనను కోరారు. పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, సీనియర్ నాయకులు సింగర్ రామ్మోహన్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, రంజిత్,అనిల్ నాయక్, జైచందన్ తదితరులు వెంట ఉన్నారు.