calender_icon.png 26 June, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

26-06-2025 01:11:23 PM

  1. రవాణా చేసే వారిని ఉక్కు పాదంతో అణచివేస్తాం 
  2. డ్రగ్స్‌ను సమూలంగా నివారించడం మనందరి బాధ్యత
  3. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్షమని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddyఅన్నారు. మాదక ద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించమని, ఉక్కుపాదంతో తమ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. డ్రగ్స్ రవాణా చేసే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉండబోతున్నాయన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద ర్యాలీని ప్రారంభించి గడియారం సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలో మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా అనే మాట వినబడడానికి వీలులేదని సీఎం రేవంత్ రెడ్డి, సహచరం మంత్రుల బృందం కఠిన నిర్ణయం తీసుకుని డ్రగ్స్ రహిత తెలంగాణ లక్షంగా ముందుకు వెళుతున్నట్లు వివరించారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్షానికి అనుగుణంగా రాష్ట్రంలో అక్రమ రవాణా, డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైనా పోలీస్ శాఖకు కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంద్న్నారు. నేటి పిల్లలే రేపటి భవిష్యత్ అని ఈ ప్రభుత్వం భావిస్తున్నందున డ్రగ్స్ నివారణకు తమ ప్రభుత్వానికి బడ్జెట్ సమస్యనే కాదన్నారు. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌ను సమూలంగా నివారించడం ప్రభుత్వం, పోలీసులతో పాటు మనందరి బాధ్యత అన్నారు. పోలీసులు వేసే ప్రతి అడుగు మన రక్షణ కోసమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలమైనది, తెలివైనదని, ఎంత దూరం వెళ్లయిన నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు తెలంగాణ పోలీసులకు ఉన్నాయని అన్నారు. నగరాలకి కాకుండా గ్రామాలకు విస్తరిస్తున్న మాదకద్రవ్యాల నివారణకు అన్ని గ్రామాల్లో కమిటీలు వేసి పోలీసులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటే కట్టడి చేయడం సులభం అవుతుందని సూచించారు. ప్రశాంతంగా, ఆప్యాయంగా ప్రేమగా ఉన్న కుటుంబ వ్యవస్థలో డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు.

ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులు ఎదగడానికి ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నదని వివరించారు.ప్రభుత్వానికి పన్నుల నుంచి వస్తున్న ప్రతి పైసా సద్వినియోగం చేస్తూ విద్యకు ఎక్కువ మొత్తంలో వెచ్చించి మీ బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతున్నామని, తాత్కాలిక వ్యసనాలకు బానిసలుగా మారితే మీ తల్లిదండ్రులతో పాటు ఈ సమాజం బాధపడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. విద్యార్థులు, యువత మంచి సహవాసంతో నడిచి భవిష్యత్తును మార్గదర్శనం చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్,  జెసి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, డీఎస్పీ శివరాంరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, నల్గొండ మాజీ మున్సిపల్  చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.