28 March, 2026 | 4:19 AM

రైతు బాంధవుడు హరీశ్‌రావు

28-03-2026 01:17 AM

పల్లె కుంట, మొండి కుంటల పునరుద్ధరణకు రూ.48 లక్షల మంజూరుపై హర్షం

సిద్దిపేట రూరల్, మార్చి 27: రైతు బాంధవుడు హరీశ్ రావు అని మాజీ ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, సర్పంచ్ గ్యార పద్మ శ్రీనివాస్ లు అన్నారు. శుక్రవారం మండల మండల పరిధిలోని రాఘవాపూర్ ఇంద్రగూడెం పల్లె కుంట, మొండి కుంటల పునరుద్ధరణ కోసం రూ. 48.20 లక్షలు కేటాయించి, రైతుల కష్టాలను తీర్చినందుకు కేసీఆర్, హరీష్ రావు ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుంటల పునరుద్ధరణ వల్ల ఎంతో మంది రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్వ రమేష్, కంతుల రాజు, కంతుల స్వామి, సంపంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.