07-06-2025 12:37:34 AM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, జూన్ 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో హరిజన వాడ గిద్ద హరిజనవాడ కుమ్మరి గల్లి లోని ఇల్లు లేని లబ్ధిదారు లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.ఇంద్రమ్మ ఇల్లు పనుల కు ముగ్గువేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నా మన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు మడమతిప్పదు అని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుంద న్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యా అని తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గానికి 3028 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. త్వరలో 472 లబ్ధిదారులను ఎంపిక చేస్తా మన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తూ ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నా మనీ తెలిపారు. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. 2 లక్షల రుణమాఫీ రైతు భరోస అందజేస్తున్నామని తెలిపారు.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నమ న్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను సకాలంలో అందజేస్తున్నా మనీ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఫామ్ హౌస్ లో పడుకొని ఇది చేయలేదు అది చేయలేదంటున్నారు. మీలా స్కాములు, కమిషన్లు కబ్జాలు, చేసి కుటుంబా అభివృద్ధి పార్టీ నాయకుల అభివృద్ధి కాకుండా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు.