27 April, 2026 | 9:17 AM

317 జీవో బాధితులకు న్యాయం చేయాలి

03-12-2024 02:19 AM

డీఎస్‌ఈకి టీపీటీయూ విజ్ఞప్తి 

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని టీపీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్టపల్లి రాధాకృష్ణ, పీ చంద్రశేఖర్ డీఎస్‌ఈని కోరారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు వారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజన ఏజెన్సీ వేతనాలను పెంచాలని, ప్రతి నెలా 10వ తేదీలోగా బిల్లులు చెల్లించాలని కోరామన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరినట్లు వారు పేర్కొన్నారు.