calender_icon.png 23 June, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవడం కోసం సాధన చేద్దాం

22-06-2025 07:58:10 PM

మొక్కలను నాటిన కామారెడ్డి యోగా సభ్యులు..

కామారెడ్డి (విజయక్రాంతి): యోగ శిక్షణలో యోగా సాధకులను అసిస్టెంట్ యోగా ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందడానికి రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండేందుకు కలిసికట్టుగా ఉండి క్రమశిక్షణతో సాధన చేద్దామని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి(District Yoga Association President Gaddam Ram Reddy) అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా యోగా భవనం ఖాళీ స్థలంలో మొక్కలను జిల్లా యోగా సంగం అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా యోగా సభ్యుల ఉద్దేశించి మాట్లాడుతూ... రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని సువిశాల ప్రదేశంలో యోగ భవనం నిర్మించుకోవడం మిగిలిన ఖాళీ స్థానంలో పచ్చదనంతో కూడిన మొక్కలను పెంచుకోవడం సుమారు 160 మంది వరకు అసిస్టెంట్ యోగ టీచర్ గా ఉత్తీర్ణులు కావడం పట్టణంలో 16 యోగ కేంద్రాలు నడపడం ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత సంతరించుకుందని రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా యోగా భవనం పరిసర ప్రాంతం ఆదర్శంగా నిలవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. మొక్కలను నాటడమే ముఖ్యం కాదని దానిని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రకృతికి అనుగుణంగా ప్రజలు జీవించాలని మనం నివసించే ప్రాంతం ప్రదేశం పచ్చగా ఉండడం కోసం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు.

మొక్కలు పెరిగి ఫలాలను అందించినప్పుడు  ఆ పలాలను స్వీకరించిన వారు మొక్కలు నాటిన వారిని గుర్తుకు చేస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొక్కలు నాటే కార్యక్రమం కాకుండా నాటిన మొక్కను సంరక్షించుకునే కార్యక్రమంగా యోగ సభ్యులు ఉండాలని యోగా భవనం చుట్టూ పచ్చని దట్టమైన అడవి లాంటి ప్రాంతాన్ని తయారు చేసుకోవడానికి ప్రతి ఒక్క సభ్యుడు అంకితభావంతో మొక్కలను సంరక్షించాలని సూచించారు. సమాజంలో యోగా సభ్యులకు అంకితభావం సేవా దృక్పథం దృఢమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారని సంఘంలో ఉన్న పేరును కాపాడుకోవాలని ఈ సందర్భంగా యోగా సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గరిపెల్లి అంజయ్య గుప్తా యోగా గురువులు బాస రఘుకుమార్, రిటైర్డ్ ఉపాధ్యాయులు అంజయ్య, అడ్లూరు మాజీ సర్పంచ్ సిద్ధ గౌడ్, హిమబిందు యోగా సాధకులు పాల్గొన్నారు.