calender_icon.png 15 June, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కామినేని హాస్పిటల్స్ రక్తదాన శిబిరం

14-06-2025 12:00:00 AM

తలసీమియా పిల్లల కోసం నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా తలసీమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.

పిడియాట్రిక్ విభాగం హెడ్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నరసింహారావు, బ్లడ్ సెంటర్ హెడ్ డాక్టర్ వివేకానంద, మార్కెటింగ్ గ్రూప్ హెడ్ సత్యనారాయణ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన పెంపొందించి, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిం చడం ద్వారా తలసీమియా బాధిత పిల్లల ఆరోగ్యకరమైన భవిషత్తు కోసం తోడ్పాటునందించగలమని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న యువతీ, యువకులు రక్తదానం చేయాలని వారు కోరారు.