14-06-2025 12:00:00 AM
తలసీమియా పిల్లల కోసం నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా తలసీమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.
పిడియాట్రిక్ విభాగం హెడ్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నరసింహారావు, బ్లడ్ సెంటర్ హెడ్ డాక్టర్ వివేకానంద, మార్కెటింగ్ గ్రూప్ హెడ్ సత్యనారాయణ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన పెంపొందించి, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిం చడం ద్వారా తలసీమియా బాధిత పిల్లల ఆరోగ్యకరమైన భవిషత్తు కోసం తోడ్పాటునందించగలమని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న యువతీ, యువకులు రక్తదానం చేయాలని వారు కోరారు.