27-06-2025 12:00:00 AM
- మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
- అంకురా హాస్పిటల్ డాక్టర్ షేక్ నిలోఫర్ సలీం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయాక్రాంతి): వేదన కలిగించే మానసిక రుగ్మతలు, డింబగ్రంథుల (ఓవేరియన్ సిస్ట్స), ఫైబ్రాయిడ్స్, ప్రసవ సంబంధిత సవాళ్లు వంటి గైనకాలజికల్ ఆరోగ్య సమస్యలు అనేక మంది మహిళలను ప్రభావితం చేస్తున్నప్పటికీ, చాలామంది మౌనంగా బాధపడుతూనే ఉంటారని, హిస్టెరెక్టమీ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అంకురా హాస్పిటల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డాక్టర్ షేక్ నిలోఫర్ సలీం అన్నారు. వైద్య శాస్త్రంలో వచ్చిన పురోగతి సమస్యలను ఎదుర్కొనే విధానాన్ని మార్చిందన్నారు.
లాపరోస్కోపీ.. దీనిని కీపొల్ సర్జరీ అని కూడా పిలుస్తారు. గైనకాలజీలో విప్లవాత్మక మార్పును తెచ్చిందన్నారు. చిన్న కోతలు, కెమెరా, మరియు నాజూకైన పరికరాలతో నిర్వహించే ఈ టెక్నిక్ ద్వారా వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స లను ఎక్కువ ఖచ్చితత్వంతో, తక్కువ శారీరక నష్టంతో చేయగలుగుతున్నా రు. చాలామందికి గర్భాశయాన్ని తొలగించే హిస్టెరెక్టమీ గురించి తెలుసు, కానీ అనేక ఇతర గైనకాలజికల్ సర్జరీలు కూడా ఇప్పుడు లాపరోస్కోపీ ద్వారా చేయవచ్చని వారికీ తెలియదు.
ఈ ప్రక్రియలు మహిళలకు తక్కువ నొప్పితో, ఎక్కువ భద్రతతో, త్వరిత రికవరీతో చికిత్సను అందించడంలో సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. గర్భాశయం తొలగించే హిస్టెరెక్టమీనే చాలా కాలంగా గైనకాలజికల్ శస్త్రచికిత్సగా భావించారు. ఇవి ఇప్పటికీ ఎక్కువగా జరిగే శస్త్రచికిత్సలలో ఒకటి అయినప్పటికీ, ఇవే ఏకైక పరిష్కారం కావు. వైద్య సాంకేతికత అభివృద్ధితో, డాక్టర్లు ఇప్పుడు మరెన్నో ముఖ్యమైన కానీ తెలియని శస్త్రచికిత్సలను లాపరోస్కోపీతో చేయగలుగుతున్నారని పేర్కొన్నారు.