15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పూరి-సేతుపతి ప్రాజెక్టులోకి కన్నడ నటుడు

29-04-2025 12:00 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీకౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషించనున్నట్టు టీమ్ ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్టులో మరో నటుడు భాగమవుతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

శాండల్‌వుడ్ డైనమో విజయ్‌కుమార్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రను పోషించనున్నట్టు తెలిపారు. కన్నడ చిత్రసీమలో ప్రముఖ నటుడిగా ఎదిగిన విజయ్‌కుమార్‌కు తెలుగులో ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఆయన ఇంతకుముందు ‘వీరసింహారెడ్డి’లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది.