18 April, 2026 | 5:44 PM

Breaking News

కరీంనగర్ కాషాయమయం

09-02-2026 01:49 AM

ముకరంపుర, ఫిబ్రవరి8(విజయక్రాంతి):*కరీంనగర్ లో ఆదివారం రాత్రి బి జె పి నిర్వహించిన విజయ సంకల్ప ర్యాలీ విజయవంతమైంది.కాషాయ పగిడీలు ధరించి కరీంనగర్ లో వేలాది మహిళలు, పురుషులు కవాతు చేశారు.కరీంనగర్ రెవిన్యూ గార్డెన్స్ నుండి ప్రారంభమైన కాషాయ ర్యాలీ టవర్ వరకు కొనసాగింది.ర్యాలీకి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఐటీ మంత్రి,

తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ ఆశీష్ షెల్లార్, కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు హాజరైన్నారు.కాషాయ దళం కవాతుతో కరీంనగర్ జన సంద్రమయింది.కాషాయ దళం ర్యాలీతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ కదం తొక్కిన ఆశీష్ షెల్లార్. బండి సంజయ్. అనంతరం టవర్ సర్కిల్ లో జరిగిన సభలో నేతలు ప్రసంగించారు.