12-06-2025 12:22:03 AM
చొప్పదండి, జూన్11(విజయక్రాంతి): కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని రామడుగు పోలీసుస్టేషన్ ను బుధవారంనాడు క రీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం తనిఖీ చే సారు..హాజరు ఉన్న సిబ్బంది పరేడ్ మరియు లాఠీ పరేడ్ నిర్వహించిన తీరును పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాదీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు.
పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు. పో లీసు స్టేషన్ కి కేటాయించబడిన వస్తువులను పరిశీలించారు. పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ను బ్లూ కోలట్స్ సిబ్బంది వినియోగించే తీరును పరిశీలించారు.
నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేసారు. పోలీసు స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నే ర్చుకోవాలన్నారు. రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్ఎస్,రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలుగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నా రు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్త్స్ర రాజు లతో పాటు ఇతర అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.