calender_icon.png 13 June, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల నడ్డివిరుస్తున్న మోదీ సర్కార్

12-06-2025 12:22:35 AM

- మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు 

మెదక్, జూన్ 11(విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు విమర్శించారు. జై బీమ్ జై బాపు జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ లోని గోల్కొండ వీధిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్బంగా మహనీయుల విగ్రహాల ముందు నిరసన తెలిపారు. సునీత రావు మాట్లాడుతూ మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో ఎన్డియే సర్కార్ ఘోరంగా విఫలం అయిందన్నారు. భారత రాజ్యాంగాన్నే మార్చే కుట్ర కేంద్రంలోని మోడీ సర్కార్ చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కేసీఆర్ అని, దానిని సరిచేసుకుంటూ పేదలకు సంక్షేమ పథకాలు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

కాంగ్రెస్ వి 420 హామీలని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కెసిఆర్ ఫ్యామిలీయే 420 ఫ్యామిలీ అని ఘాటుగా విమర్శించారు. లిక్కర్ కేసులో జైలుకెళ్ళింది ఎమ్మెల్సీ, కెసిఆర్ కూతురు కవిత కాదా అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అంటేనే బందీ పోట్ల రాష్ట్ర సమితి అని సునీత రావు ఏద్దేవా చేశారు. పదేండ్ల లో బిఆర్‌ఎస్ పెద్దలు దోచుకున్నదంతా కక్కిస్తామమన్నారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా బూత్ స్థాయి కమిటీలు వేస్తామన్నారు. 

ఈ సందర్బంగా పలువురు లబ్ధిదారులను కలిసి సన్నబియ్యం అమలు తీరును తెలుసుకొని అక్కడే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరికాల అనుసూర్య,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవుసుల భవాని,జిల్లా నాయకులు ముక్తా బాయి, అరుణ, కమల, స్వరూప, స్వప్న, అయితారo మల్లేశ్వరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.