30 June, 2026 | 11:27 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

దుబాయ్‌లో కరీంనగర్ వాసి కష్టాలు

22-07-2025 01:44 PM

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు(Karimnagar District) చెందిన వ్యక్తికి దుబాయ్ లో కష్టాలు ఎదురయ్యాయి. ఏడు నెలల క్రితం ఉపాధి కోసం దొబ్బల బాలరాజు(50) అనే వ్యక్తి దుబాయ్(Dubai)కి వెళ్లి కష్టాల్లో చిక్కుకున్నాడు. బాలరాజు స్వస్థలం చిగురుమామడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామం. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య బాగాలేక పనిచేయని స్థితికి చేరుకున్నాడు. యాజమాన్యం తన పాస్ పోర్టు(Passport) లాక్కొని వేధిస్తున్నట్లు బాలరాజు వాపోతున్నాడు. దుబాయ్ లో తన కష్టాలు వివరిస్తూ బాలరాజు భార్యకు సెల్ఫీ వీడియో పంపాడు. తన భర్తను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని స్వరూప తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని స్వరూప విజ్ఞప్తి చేస్తోంది. బాధితుడు దొబ్బల బాలరాజుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.