6 May, 2026 | 9:25 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

ఫైనల్లో కర్ణాటక

15-01-2025 11:50 PM

విజయ్ హజారే ట్రోఫీ

వడోదర: దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం హర్యానాతో జరిగిన సెమీఫైనల్లో కర్ణాటక ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (48),  హిమాన్షు రానా (44) పర్వాలేదనిపించారు. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి 4 వికెట్లతో రాణించగా.. ప్రసిధ్, శ్రేయస్ గోపాల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన కర్ణాటక జట్టు 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసి గెలుపొందింది. ఇన్‌ఫామ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (86), స్మరణ్ రవిచంద్రన్ (76) అర్థసెంచరీలతో విజయంలో కీలకపాత్ర పోషించారు. హర్యానా బౌలర్లలో నిషాంత్ సింధూ 2 వికెట్లు తీశాడు. కాగా కర్ణాటక విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి. నేడు జరగనున్న రెండో సెమీస్‌లో విదర్భ, మహారాష్ట్ర తలపడనున్నాయి.