16-06-2025 02:06:14 PM
తోటి స్నేహితుడు ఉన్నత పదవికి ఎంపికతో ఆనందోత్సాహాలు..
వైరా,(విజయక్రాంతి): తమతో చిన్నప్పుడు చదువుకున్న తోటి స్నేహితుడు ఉన్నత పదవికి ఎంపిక కావడం పట్ల చిన్ననాటి స్నేహితులు మదిలో హర్షాతిరేకాలు వెల్లివిరిసాయి. 1984-85 విద్యా సంవత్సరంలో వైరాలోని జీజేసీ, ప్రభుత్వ పాఠశాల పదవ తరగతిలో విద్యను అభ్యసించిన తోటి స్నేహితులు తనతోపాటు చదువుకున్న ప్రస్తుతం రాష్ట్ర టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన కట్ల రంగారావును సోమవారం వైరాలో ఘనంగా సన్మానించారు.
స్నేహితులంతా వైరాలోని కట్ల రంగారావు స్వగృహానికి వెళ్లి అందరూ ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఉన్నత పదవి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు స్నేహితులు శాలువాలతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందించి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు 1984 -85 సంవత్సరంలో వైరాలోని ప్రభుత్వ జిజేసి పాఠశాల నందు కలిసి చదువుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు.
తమ స్నేహితుడికి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం లభించడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర మాజీ మంత్రివర్యులు రేణుక చౌదరి కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో సూతకాని. కృపానందం, మల్లెల. రవీంద్ర ప్రసాద్, బత్తుల శ్రీనివాస్, బుగ్గినేని సైదులు,సయ్యద్ అతావుల్లా, గజ్జల నరసింహారావు, కట్ల కోటయ్య, షేక్ మస్తాన్, షేక్ మీరా, దానయ్య, చిట్టిబాబు, కరెంటు నాగేశ్వరరావు, చింతమాల రవికుమార్, కేశా రామారావు, బోనాల సీతారాములు తదితరులు ఉన్నారు