calender_icon.png 26 June, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ మహాసభలకు కవితా విద్యాసాగర్ విరాళం

26-06-2025 12:05:08 AM

సంస్థాన్ నారాయణపూర్,జూన్25(విజయ క్రాంతి): నారాయణపురం మండల కేంద్రంలో ఈనెల 27వ తేదీన నిర్వహించబోయే  సిపిఐ పార్టీ 15వ మండల మహాసభలకు బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుడిమల్కాపురం మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ రూ.10 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు.

నారాయణపూర్ మండల సీపీఐ పార్టీ తరపున విద్యాసాగర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, బిఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చిలువేరు బిక్షం, నాయకులు కురుమిద్దె శ్రీనివాస్,పల్లె మల్లారెడ్డి,రాసాల వెంకటేష్, బొడ్డుపల్లి గాలయ్య, జక్కిడి యాదిరెడ్డి, శ్రీరామ్, వీరమల్ల యాదయ్య, మన్నే శంకర్ రెడ్డి  పాల్గొన్నారు.