జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు
బీఆర్ఎస్ ఉట్టి కథలు.. కాంగ్రెస్ పిట్ట కథలు
హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని డీజీపీని కవిత కోరారు. ఆర్టీసీ సమ్మెకు(RTC Strike) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమ్మె, నీటి సమస్యలు , ఫీజు రీఎంబర్స్ మెంట్(Fee Reimbursement) సమస్యలున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ఉట్టి కథలు.. కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పిందని కవిత ఎద్దేవా చేశారు. తమ పార్టీలో యువతకు అవకాశాలు ఉంటాయని కవిత సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర సమస్యలపై మాట్లాడలేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ లో మహిళలకు ప్రాధాన్యం ఉండదని తెలిపారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని కవిత స్పష్టం చేశారు. వెయ్యి ఏళ్లయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ మారవన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు.






