21 April, 2026 | 5:08 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

21-04-2026 03:45 PM

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతోంది

హైదరాబాద్: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(Congress Party Political Affairs Committee) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కర్ పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతోందని తెలిపారు. ఇటీవలే రూ. 200 కోట్లతో కొత్త ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని వినతులు వచ్చాయని వెల్లడించారు. నారాయణఖేడ్ ఆస్పత్రిలో మరో 50  పడకలు మంజూరు చేస్తామన్నారు. జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ యోచన అన్నారు.