15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భద్రాచలంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 08:24 PM

భద్రాచలం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కలవకుండా చంద్రశేఖర రావు 72వ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం మండల పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పార్టీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం అభయాంజనేయ స్వామి పిల్లల పార్కు నందు కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ మాట్లాడుతూ... నిండు నూరేళ్లు తెలంగాణ రాష్ట్ర సాధకుడు పోరాట యోధులు కేసీఆర్ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండి మూడవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా విభాగం, యువజన విభాగం,అన్ని రంగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.